Saturday, April 20, 2024

Follow up | మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన బస్సు, 24 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లాలో మంగళవారం ఉదయం 8.40 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ బస్సు వంతెనపైనుంచి పడిపోవడంతో 24మంది మృతి చెందగా, మరో 41మందికి పైగా గాయపడ్డారని రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించినట్లు మిశ్రా తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలుపుతూ పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్‌ (ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) నుండి మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ ఒక్కొక్కరికి 4 లక్షల రూపాలయలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ. 50వేలు, స్వల్పంగా గాయపడివారికి రూ. 25వేలు అందజేస్తామని మిశ్రా తెలిపారు.

చికత్సకు అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. బస్సు ఓవర్‌ లోడ్‌తో అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్న విషయం వెలుగులోకి రావడంతో ఖర్గోన్‌ జిల్లా అసిస్టెంట్‌ రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ని సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పటేల్‌ తెలిపారు. బస్సులో 70మంది ప్రయాణీకులు ఉన్నారని, ఆ బస్సులో కేవలం 37మంది మాత్రమే కూర్చునే సామర్థ్యం ఉందని మంత్రి తెలిపారు. తీవ్రంగా గాయనపడిన 18మందిని ప్రాథమిక చికిత్స అనంతరం తదుపరి చికిత్స కోసం ఇండోర్‌కు తరలించగా, 23మందిని ఖార్గోవ్‌ జిల్లా ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement