Thursday, April 25, 2024

ఆపరేషన్ గంగతో వేగంగా తరలింపు.. విద్యార్థులకు స్వాగతం పలికిన కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆపరేషన్ గంగ ద్వారా ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను వేగంగా తరలిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అక్కడి భయానక పరిస్థితులను అధిగమించి విద్యార్థులు విజయవంతంగా స్వదేశానికి చేరుకోవడంపై ఆయ‌న సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం విద్యార్థులు ఆయనతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారందరినీ తిరిగి తీసుకొచ్చే వరకూ ఆపరేషన్ గంగ ఆగదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement