Saturday, April 20, 2024

కేసీఆర్ సభపై నీలి నీడలు!

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభ ఉంటుందా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్ సభను రద్దు చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న హైకోర్టు అత్యవసర అనుమతి నిరాకరించడంతో మరోసారి చీఫ్ జస్టిస్ బెంచ్ దగ్గర  రైతులు పిటిషన్ వేశారు. అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని పిటిషన్‌ దాఖలు చేశారు. కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని సభకు అనుమతి ఇవ్వొద్దని పిటిషన్‌ లో రైతులు పేర్కొన్నారు. రేపు సీఎం కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో అనుమతి నిరాకరించాలని పిటిషన్‌లో రైతులు పేర్కొన్నారు.

కోవిడ్ నేపథ్యంలో సభలు, సమావేశాలు రద్దు చేస్తూ ప్రభుత్వం.. జీవో 69 విడుదల చేసి మళ్ళీ ఇలా లక్షలాది మందితో సభ ఎలా పెడతారని పిటిషన్ దాఖలు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సభకు రద్దు చేయాలని రైతులు కోరారు. హౌస్ మోషన్‌కు అనుమతిపై రైతులు ఎదురుచూస్తున్నారు. హౌస్ మోషన్ విచారణకు అనుమతి ఇస్తుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.  మరోవైపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 14న హాలియాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులు సీఎం సభపై కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ సభపై నీలి నీడలు అలుముకున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement