Wednesday, April 17, 2024

ఢిల్లీలో ఏపీ గవర్నర్, రాష్ట్రపతితో వీడ్కోలు విందు.. రేపు ఉపరాష్ట్రపతితో భేటీ!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన శనివారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో జరిగిన వీడ్కోలు విందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ఈనెల 24తో ముగుస్తుండడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల గరర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితుల కారణంగా తెలంగాణ గవర్నర్ మినహా పలు రాష్ట్రాల గవర్నర్లు విందుకు హాజరయ్యారు. రేపు ఉపరాష్ట్రపతి భవన్లో వెంకయ్య నాయుడుతో జరిగే మధ్యాహ్న విందులోనూ బిశ్వభూషణ హరిచందన్ పాల్గొంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement