Thursday, April 25, 2024

ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు మానుకోవాలి : మంత్రి జయరాం

ఆలూరు : ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మంత్రి క్యాంప్ కార్యాలయం నందు మంత్రి జ‌య‌రాం మాట్లాడుతూ.. టీడీపీ అసత్య ప్రచారాలు చేయడం, కొన్ని చానల్లో ప్రసారమవుతున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని తెలిపారు. తమ కుటుంబం గత కొన్ని సంవత్సరాల నుంచి సర్పంచు, జెడ్పి, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా పని చేస్తున్నానని తెలిపారు. తమ కుటుంబం 100 ఎకరాల ఆసామీగా జీవనం సాగిస్తున్నామని, ఆస్పరి మండలంలో కేవలం 52 లక్షలు విలువ చేసే భూమిని తమ కుటుంబం కొనుగోలు చేసింది వాస్తవమని తెలిపారు. ఐటీ అధికారులు తమ కుటుంబానికి ఎలాంటి నోటీసులు అందలేదని, పొలం కొనుగోలు బినామీలు కాదని తమ కుటుంబ సభ్యులనే తెలిపారు. 100 ఎకరాలు ఆసామి భూమి కొనుగోలు చేయడం తప్ప అని తెలిపారు, రిజిస్టర్ కార్యాలయంలో భూముల కొనుగోలు విషయంలో పూర్తిగా తెలుసుకొని కొనుగోలు చేశామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement