Saturday, April 20, 2024

ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకల నిషేధంపై పొడిగింపు

దేశంలో కరోనా మహమ్మారి రెండు వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకల నిషేదాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్ 26వ తేదీన జారీ చేసిన ఆదేశాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టంచేసింది.

ఇందుకు సంబంధించి డీజీసీఏ జాయింట్ కలెక్టర్ జనరల్ సునీల్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. అలాగే డీజీసీఏ ప్రత్యేకంగా ఎంపిక చేసిన దేశాలకు మాత్రం విమానాలు నడుస్తాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement