Thursday, April 25, 2024

టీచర్ల బదిలీల దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీచర్ల బదిలీలకు సంబంధించిన దరఖాస్తు గడువు సోమవారంతో ముగియడంతో విద్యాశాఖ పొడిగించింది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా విద్యాధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలను జారీ చేసింది. ఎడిట్‌ ఆప్షన్‌ను కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 53వేల దరఖాస్తులు అందినట్లు విద్యావర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement