Thursday, April 25, 2024

Breaking: పేలిన గ్యాస్ సిలిండర్.. ఐదుగురు మృతి, 60 మందికి గాయాలు

గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 60 మంది గాయపడ్డ విషాద ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకున్నది. పెండ్లింట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు.

జోధ్‌పూర్‌లోని భుంగ్రా గ్రామంలో ఓ ఇంట్లో వివాహ వేడుక జరుగుతుండగా సిలిండర్‌ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహకారంతో గాయపడినవారిని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారని, వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement