Thursday, April 25, 2024

విద్యాసంస్థలే బంద్…. పరీక్షలు యధాతధం

కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఉన్న విద్యా సంస్థలన్నీ రేపటి నుంచి మూసివేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అయితే దీనితో యూనివర్సిటీలలో జరిగే పరీక్షల నిర్వహణపై విద్యార్థులలో అయోమయం నెలకొంది. కాగా జరగాల్సిన పరీక్షల పై అధికారులు స్పష్టత ఇచ్చారు. ఓయూ పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు యధావిధిగా జరుగుతాయని ఓయూ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ స్పష్టం చేశారు.

అలాగే జేఎన్టీయూలో పరీక్షలు కూడా యధాతథంగా జరుగుతాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ క్లారిటీ ఇచ్చారు. కరోనా కారణంగా పరీక్ష రాయలేని వారికి ప్రత్యేకంగా మరోసారి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement