Thursday, April 25, 2024

భూగర్భ జలశాఖలోని పలుపోస్టులకు పరీక్ష తేదీలు ఖరారు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భూగర్భ జలశాఖలోని గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. గెజిటెడ్‌ పోస్టులకు ఏప్రిల్‌ 26, 27న పరీక్ష నిర్వహించనున్నారు. నాన్‌ గెజిటెడ్‌ పోస్టులకు సంబంధించిన పరీక్షను మే 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్‌లలో ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష తేదీకి ఓ వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement