హైదరాబాద్, ఆంధ్రప్రభ: వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. వచ్చే ఏడాది 2023 జనవరి 22న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రెండు పేపర్లకు పరీక్ష నిర్వహించనుండగా ఒక్కో పేపర్కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు. మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. 1540 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement