Friday, April 19, 2024

డీజీపీకి లేఖ రాసిన మాజీ సీఎం చంద్రబాబు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆదివారం నాడు లేఖ రాశారు. కర్నూలు జిల్లా పెసరవాయిలో గత నెల 17న టీడీపీ నేతలు నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి హత్యలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి చంద్రబాబు తెలిపారు. సాక్షుల్ని బెదిరిస్తున్న వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జంట హత్యల కేసు సాక్షులకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ కేసులో అధికార పార్టీ వైసీపీకి చెందిన నేతలకు సంబంధం ఉందని చంద్రబాబు ఆరోపించారు. కాగా టీడీపీ నేతల హత్యలు దారుణమని సదరు లేఖలో పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: పొలం దున్నుతుండగా బయటపడిన గణపతి విగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement