Thursday, April 25, 2024

నేను చేసే ప్ర‌తి ప‌ని నీతోనే మొద‌ల‌వుతుంది..ముగుస్తుంది అమ్మా.. జాన్వీక‌పూర్

త‌ల్లికి త‌గ్గ త‌న‌య‌గా పేరు తెచ్చుకుంటుంది జాన్వీక‌పూర్. గ్లామరస్‌ పాత్రలతోపాటు నటనకు ఆస్కారమున్న సినిమాలు చేస్తూ ప్రయాణాన్ని సాగిస్తోంది.ధడక్‌ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ జర్నీ మొదలుపెట్టిన జాన్వీకపూర్‌ గతేడాది గుడ్‌ లక్‌ జెర్రీ, మిలీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. జాన్వీకపూర్‌ ప్రస్తుతం బవాల్‌, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి (Mr & Mrs Mahi)చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో బవాల్‌ చిత్రీకరణ పూర్తవగా.. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి షూటింగ్ దశలో ఉంది. తల్లి శ్రీదేవి లేని లోటును గుర్తు చేసుకుంటూ ఓ మెసేజ్ ని అందరితో పంచుకుంది జాన్వీకపూర్. అమ్మా.. నేను ఇప్పటికీ నీ కోసం ప్రతిచోటా వెతుకుతున్నాను. ఇప్పటికీ నేను చేసే ప్రతీ పని నువ్వు గర్వపడేలా ఉంటుందని ఆశిస్తున్నా.. నేను ఎక్కడికి వెళ్లినా.. నేను చేసే ప్రతి పని నీతోనే మొదలవుతుంది.. ముగుస్తుంది.. అంటూ బావోద్వేగపూరిత సందేశాన్ని ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement