Wednesday, April 24, 2024

సీనియర్ హీరో అయినా కృష్ణకి ఇగో ఉండేది కాదు.. మంత్రి రోజా

హీరో కృష్ణ మరణం పట్ల మంత్రి రోజా విచారం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించారనే వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. దిగ్గజాలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు.. ఇప్పుడు కృష్ణ కూడా మరణించడం తెలుగు సినీ రంగానికి తీరని లోటని అన్నారు మంత్రి రోజా. కృష్ణ ఎంతో సీనియర్ అయినా.. ఆయనకి ఇగో ఉండేది కాదని తెలిపారు. మహేష్ బాబుకు దేవుడు ఎందుకు ఇంత కష్టం ఇచ్చాడో అని వ్యాఖ్యానించారు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మంత్రి రోజా ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement