Tuesday, April 16, 2024

మాన‌సికంగా ఆరోగ్యంగానే ఉన్నా.. ట్రోల‌ర్స్ కి స‌మాధాన‌మిచ్చిన శృతిహాస‌న్

నాకు వైర‌ల్ ఫీవ‌ర్ ఉండ‌టం వ‌ల్లే వాల్తేరు వీర‌య్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేద‌ని హీరోయిన్ శృతిహాస‌న్ తెలిపింది.తాను ఎప్పుడూ మానసికంగా ఆరోగ్యంగానే ఉంటానని స్పష్టం చేసింది. తాను ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటానని పేర్కొంది. మీరు ఈ అభిప్రాయం నుంచి బయటకు రండి. లేదంటే థెరపిస్ట్ ను సంప్రదించండి అని తన పట్ల తెలిసీ, తెలియకుండా మాట్లాడే వారికి గట్టి బదులు ఇచ్చింది. తనకు మానసిక ఆరోగ్యం బాగోలేదంటూ వస్తున్న వార్తలపై సీరియస్ గా స్పందించింది.

కాగా మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో ఆమె నటించింది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ కార్యక్రమం ఈ నెల 8న విశాఖపట్నంలో జరిగింది. తనకు అనారోగ్యంగా ఉండడంతో హాజరు కాలేకపోతున్నానంటూ ఆమె ముందే తెలియజేసింది. అనారోగ్యం అని చెప్పి ముఖ్యమైన కార్యక్రమానికి రాకపోవడంతో పలు పుకార్లకు అవకాశం లభించింది. దీంతో మానసిక అనారోగ్యం వల్లే కార్యక్రమానికి డుమ్మా కొట్టిందంటూ పుకార్లు వచ్చాయి. ఈ దుష్ప్రచారంపై శ్రుతిహాసన్ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఘాటుగా స్పందించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement