Thursday, April 18, 2024

మంత్రివర్గం నుంచి ఈటెల బర్తరఫ్

ఈటెల రాజేందర్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేస్తూ తక్షణమే ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది.

కాగా ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడిన విషయం నిజమేనంటూ మెదక్ కలెక్టర్ సీఎస్ కు నివేదికను అందించారు. అసైన్డ్ ల్యాండ్ 66 ఎకరాలను ఈటెల రాజేందర్ కబ్జా చేసినట్లు ఈ నివేదికలో వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement