Saturday, April 20, 2024

మాజీ మంత్రి ఈటెలకు తప్పిన ప్రమాదం

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బృందానికి ప్రమాదం తప్పింది. ఈటెల బృందం ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. దీంతో పైలట్‌ అలెర్ట్‌ అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్‌ సమయంలో సాంకేతిక సమస్యను పైలట్‌ గుర్తించాడు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈటెల బృందం బయలుదేరింది. సోమవారం ఢిల్లీలో ఈటెల లాంఛనంగా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈటెల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ సమయంలో ఈ ఘటన జరిగింది.

ఇటీవల టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఈటెలకు సోమవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వద్ధామ రెడ్డి బీజేపీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement