Wednesday, April 24, 2024

Telangana | ఉత్సాహంగా రేవంత్​రెడ్డి ‘యాత్ర’.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ముందుకు! (వీడియో)

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. హథ్ సే హథ్ పాదయాత్రలో భాగంగా నిన్న మేడారం వనదేవతల సన్నిధి నుంచి రేవంత్ ‘యాత్ర’ పేరిట ముందుకు సాగుతున్నారు. గతంలో వైఎస్సార్ ఏ విధంగా ప్రజలని ఆకట్టుకునేలా పాదయాత్ర చేశారో అదే తరహాలో రేవంత్​ యాత్ర కొనసాగుతోంది.

వైఎస్సార్​ సెంటిమెంట్​ మాదిరిగానే మహిళా నేత, ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గమైన ములుగు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఇది దాదాపు రెండు నెలలపాటు కొనసాగనుంది. రెండో రోజులో భాగంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండడంతో రేవంత్​, సీతక్కతో పాటు చాలామంది కాంగ్రెస్​ పార్టీ నేతలు, కార్యకర్తలు చెట్టునీడన సేదతీరే వీడియో ఒకటి నెట్టింట వైరల్​ అవుతోంది.

కాగా, ప్రధానంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో రేవంత్​రెడ్డి పాదయాత్ర ముందుకెళుతుందని తెలుస్తోంది. ఆ నాలుగు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎక్కువ ఫోకస్ చేసి.. బలం మరింత పెంచాలని చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement