Monday, March 25, 2024

విద్యుత్ ముసాయిదా బిల్లు కూడా వాపస్ తీసుకోవాలే..

ప్ర‌భ‌న్యూస్ : వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్‌ ముసాయిదా బిల్లునూ వెనక్కి తీసుకోవాలని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాలతో పాటు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్‌ బిల్లును ఎత్తివేస్తున్నట్లు, అలాగే ఉద్యమ సందర్భంగా చనిపోయిన రైతులు, వేలాది మంది రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన చేయకపోవడం శోచనీయమన్నారు. పంటల మద్దతుధర, రైతు రుణాల రద్దు ముసాయిదా బిల్లుపై ఏ నిర్ణయాన్ని మోడీ చెప్పలేదన్నారు. రైతాంగ పోరాటంలో కలిసి వచ్చిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలకు సిపిఐ (ఎం) తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement