Wednesday, April 24, 2024

ఎల‌క్ర్టానిక్ వాహ‌న రంగంలో తెలంగాణకి భారీ పెట్టుబ‌డి..

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈవీ రంగంలో రూ.2100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ట్రైటాన్ సంస్థ ముందుకు వచ్చింది. జహీరాబాద్ నిమ్జ్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పెట్టుబడితో సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. తొలి ఐదేళ్లలో సుమారు 50వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించనుంది. పెట్టుబడి కోసం తెలంగాణను ఎంచుకున్నందుకు ట్రైటాన్ సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందని కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement