Friday, April 26, 2024

పవన్‌కు ఈసీ నోటీసులు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనా పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై ఇప్పటికే తెలంగాణ బీజేపీ, జనసేనా పార్టీల మధ్య వైరం నెలకొంది. ఇప్పుడు ఇదే అంశం పవన్ కు మరో ఇబ్బందిని తెచ్చిపెట్టింది. పోలింగ్ జరుగుతున్న సమయంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణికి పవన్ మద్దతు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా సురభి వాణికి మద్దతు ప్రకటించడంపై ఈసీ సీరియస్ అయింది. ఈ మేరకు పవన్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement