Friday, April 26, 2024

ఈనెల 27 నుంచి అమెజాన్‌ ఓటీటీలో కొత్త సినిమా

లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో చిన్న సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇప్పటికే అనసూయ నటించిన ‘థాంక్యూ బ్రదర్’ మూవీ ఓటీటీలో విడుదలైంది. తాజాగా మరో సినిమా ఈనెల 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ ఈనెల 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రిలీజ్ పోస్టర్ కూడా విడుదల చేసింది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ‘పేపర్ బాయ్’ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ మూవీకి కథ అందించాడు. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement