Saturday, April 20, 2024

బండి సంజయ్‌ను కలవనున్న ఈటెల రాజేందర్.. బీజేపీలో ఈటెల చేరే అవకాశం?

తెలంగాణలో కరోనా వైరస్ వేళ కూడా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. భూకబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈటెల రాజేందర్‌ను వైద్యశాఖ మంత్రిగా తొలగించగా.. ఈటెల సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన ఈటెల త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఈటెల కలవనున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి ఈటెల మాట్లాడినట్లు టాక్. రాజకీయ సమీకరణాలు కుదిరితే ఈటెల బీజేపీలో చేరడం ఖాయమని కమలం పార్టీ వర్గాలు చెప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement