Wednesday, March 27, 2024

Big Breaking | హైటెన్షన్​ మధ్య ముగిసిన ఈడీ విచారణ.. ఆఫీసు నుంచి బయటికి వచ్చిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌, మనీ లాండరింగ్​ కోణంలో ఆరోప‌ణ‌ల‌ను ఎద‌ర్కొంటున్న‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ జరుపుగోతంది. కాగా, ఇప్పటికే రెండు దఫాలుగా ఈడీ విచారణకు హాజరు కాగా.. ఇవ్వాల మూడోసారి విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాగిన విచారణ రాత్రికి కానీ ముగిసింది. ఉద‌యం ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు హాజరైన కవిత.. 10 గంటలకు పైగా అక్క‌డే ఉన్నారు. ఆమెను ప‌లు అంశాల‌పై అధికారులు ప్ర‌శ్నించినట్టు తెలుస్తోంది. కాగా, విచారణ మధ్యలో ఈడీ అధికారులు కవిత న్యాయబృందాన్ని పిలిపించారు. ఈ క్రమంలో న్యాయవాది సోమ భరత్​ హుటాహుటిన ఈడీ ఈఫీసు లోపలికి వెళ్లారు.

కవిత న్యాయవాది సోమ భరత్ హుటాహుటీన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. వారు కోరిన సమాచారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులకు అంద‌జేసిన‌ట్టు స‌మాచారం. ఈ సందర్భంగా సోమ భరత్ వెంట బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ కూడా ఉన్నారు. కవిత విచారణ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఈడీ ఆఫీసులోని 3వ ఫ్లోర్లో కవిత విచారణ కొనసాగుతోంది. రాత్రి 9.40 నిమిషాల తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్తెచారు. కవిత అందించిన ఫోన్​లలో డేటాను ఈడీ అధికారులు విశ్లేషణ చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement