Friday, March 29, 2024

ఉత్తరాఖండ్‌లో భూకంపం.. భ‌యాందోళ‌న‌కు గురైన ప్ర‌జ‌లు

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో భూకంపం సంభ‌వించింది. ఆదివారం ఉద‌యం రిక్టర్‌స్కేలుపై 4.5గా భూకంత తీవ్ర‌త‌గా న‌మోదైన‌ట్లు అధికారులు తెలిపారు. తెహ్రీకి 78 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. అయితే ఒక్క‌సారిగా భూమి కంపించ‌డం ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో రోడ్ల‌పైకి ప‌రుగులు తీశారు. భూకంపం వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని ఇంకా అధికారికంగా వెల్ల‌డించ‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement