Friday, March 29, 2024

దువ్వాడ రైల్వే స్టేషన్‌ ఘటన విషాదాంతం.. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి..

దువ్వాడ రైల్వే స్టేషన్‌ ఘటనలో రైలు, ప్లాట్‌ ఫాం మధ్య‌ నలిగిన యువతి శశికళ కన్నుమూసింది. అంతర్గత గాయాల వల్ల ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. నిన్న గుంటూరు-రాయగఢ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కి దువ్వాడ రైల్వే స్టేషన్‌లో దిగే క్రమంలో ఒక్కసారిగా రైలు కుదుపునివ్వడంతో తలుపు వద్ద నిలబడ్డ శశికళను తలుపు ఢీ కొనడంతో ఆమె జారీపడి రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. రెస్క్యూటీం సహకారంతో గంటన్నర పాటు శ్రమించి బయటకు తీశారు. గాయ‌ప‌డిన విద్యార్థిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంలో ఆమె యూరిన్‌ బ్లాడర్‌ దెబ్బతినడం, ఎముకలు నలిగిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు అనేక రకాలుగా వైద్య సహాయం అందించినప్పటికీ ఆమె గురువారం మధ్యాహ్నం చికిత్సపొందుతూ మృతి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement