Thursday, April 25, 2024

షూటింగ్ స‌మ‌యంలో డెంగ్యూ బారిన ప‌డ్డా.. కంగ‌నార‌నౌత్

తాను డెంగ్యూ బారిన ప‌డిన‌ట్లు తెలిపింది బాలీవుడ్ భామ కంగ‌నార‌నౌత్. ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ చేసే సమయంలో ఫస్ట్ షెడ్యూల్ లోనే తాను డెంగ్యూ బారిన పడిన‌ట్లు చెప్పింది. ఆ సమయంలో చాలా కష్టాలు పడ్డానని రక్త కణాలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపింది. నా మీద నాకే అనుమానం వచ్చింది. భగవంతుడు పరీక్షలు పెట్టినట్లుగా అనిపించింది. నా ఆరోగ్య సమస్యల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు.ఎందుకంటే నన్ను ప్రేమించేవారు ఆందోళన చెందుతారు. అలాగే నన్ను ద్వేషించేవారు సంతోషిస్తారు. ఆ అవకాశం నేను వారికి ఇవ్వకూడదు.

అలాగే నన్ను ప్రేమించే వారి ఆందోళనకి నేను కారణం కాకూడదు. ఈ కారణంగానే నా అనారోగ్య సమస్యను బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఉంది. మన మీద మనకు నమ్మకం ఉండి మనం కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నెగ్గాల్సిందే. సాధించే వరకు వదిలిపెట్టకూడదు. నాకైతే మళ్లీ ఇది పునర్జన్మ లాంటిది. దానికి సాయం చేసిన నా టీం అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీ ప్రేమ ఆశీస్సులు ఉంటే కచ్చితంగా సంతోషంగా ఉంటాను అని కాంగన రనౌత్ తన ఇంస్టాగ్రామ్ లో సుదీర్ఘ పోస్ట్ రాసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement