Thursday, March 28, 2024

మహమ్మారి దెబ్బ….తగ్గిన శ్రీవారి దర్శనాలు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అలాగే వేల మంది మృతి చెందుతున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ ముఖ్యంగా తిరుమల శ్రీ వారి దర్శనాల మీద పడింది. ఆదివారం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 5081 కి పడిపోయింది.

అలాగే రెండు 2104 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అంతేకాకుండా మరోవైపు ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. శ్రీవారి హుండీ ఆదాయం ఆదివారం కేవలం 39 లక్షలు మాత్రమే. మరోవైపు లడ్డూ ప్రసాదాలు నుంచి పదివేల రూపాయలు విక్రయాలు మాత్రమే జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement