Friday, April 26, 2024

మంత్రి హరీశ్ రావు సమక్షంలో.. టీఆర్ఎస్ లోకి దుబ్బాక బీజేపీ నేతలు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి, తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు, దుబ్బాక ముద్దుబిడ్డ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీజేపీ నేతలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండలం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గ్రామం బొప్పాపూర్, దుబ్బాక మండల బీజేపీ అధ్యక్షులు అరిగే కృష్ణ టీఆర్ఎస్ లో చేరారు. దుబ్బాక బై ఎలక్షన్ లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలకు చాలా హామీలు ఇచ్చామని, ప్రజల్లోకి వెళ్తే ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలను మర్చిపోయి మళ్ళీ వస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే.. ఎన్నికల ముందు చెప్పిందల్లా చేస్తామా.. వాళ్లే మర్చిపోతారంటూ సర్ది చెప్పారన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టకపోవడంతో పాటు తనతో తిరిగే కార్యకర్తను పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని హరికృష్ణ అన్నారు. అవి నెరవేరాలంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ కాపాడుకుంటుందనే ఒక నమ్మకంతో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితోనే దుబ్బాక అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో తాము బీజేపీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో దుబ్బాకలో టీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాస్ కొత్త కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు తెకులపల్లి మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ నగరం జిడిపల్లి రవి, ఎనుగుర్తి మాజీ సర్పంచ్ లింబాద్రిగా, బొప్పాపూర్ టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కమలాకర్ రావు, ముక్క వెంకటపతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement