Friday, April 19, 2024

తెర‌కెక్క‌నున్న దృశ్యం3 -క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్

దృశ్యం3 తెర‌కెక్కుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నిర్మాత అంటోనీ పెరుంబవూర్. రీసెంట్ గా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో దృశ్యం-3 తెరకెక్కబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మలయాళం లో జీతూజోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం సినిమా, తెలుగు, తమిళం తో పాటు హిందీలోనూ పునర్నిర్మితం అవుతూ ప్రేక్షకుల్ని మెప్పించాయి.
కథానాయకుడు తన సినిమా తెలివితేటలని ఉపయోగిస్తూ పోలీసుల చేతికి దొరక్కుండా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ రావడమే ఈ కథ. కాగా, ఇటీవల దృశ్యం-3 కు సంబంధించిన ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్టర్ లో మోహన్ లాల్ సంకెళ్లతో కనిపించారు. మరి ఈసారి మూడో భాగంలో కథానాయకుడు పోలీసులకి దొరికాడా లేక తప్పించుకున్నాడా? అనేది ఆసక్తి కరంగా మారింది.మలయాళం లో మోహన్ లాల్ నటించగా, తెలుగులో విక్టరీ వెంకటేష్, తమిళంలో కమలహాసన్, హిందీలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించారు. అనుకోకుండా జరిగిన ఓ హత్య చుట్టూ సాగే కుటుంబ కథలు ఇవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement