Friday, April 26, 2024

Drugs Case: నేడు మళ్లీ ఎన్‌సీబీ ముందుకు అనన్య

Bollywood: ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్ కేసు బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎన్సీబీ మరింత దూకుడు పెంచింది. నిన్న హీరోయిన్‌ అనన్య పాండేను రెండు గంటల పాటు విచారించిన అధికారులు.. ఇవాళ మరోసారి ఎంక్వైరీకి రావాలని నోటీసులు జారీ చేశారు.

హీరోయిన్ అనన్య పాండే 11గంటలకు ఎన్సీబీ అధికారుల ముందు హాజరుకానున్నారు. కింగ్ ఖాన్ షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ మీకు ఎలా పరిచయం ? మీరు డ్రగ్స్‌ తీసుకుంటారా ? ఆర్యన్‌తో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నారా ? ఆర్యన్‌కు ఎప్పటినుంచి డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉంది ? మ‌ఈకు డ్రగ్స్‌ ఎవరు స‌ప్ల‌య్ చేసేది.? అనే అంశాలపై ప్రశ్నలు అడిగిన ఎన్‌సీబీ ఆఫీస‌ర్లు.. ఇవాళ మరింత లోతుగా ఎంక్వైరీ చేసే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement