Friday, April 19, 2024

Drugs case: ఈడీ విచారణకు హాజరయిన హీరో రానా

సంచలనం సృష్టిస్తున్నా టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో హీరో దగ్గుబాటి రానా కాసేపటిక్రితమే ఈడీ విచారణకు హాజరయ్యాడు. దగ్గుబాటి రానా బ్యాంక్ స్టేట్ మెంట్ తో పాటు విచారణకు హాజరయినట్లు తెలుస్తోంది. హీరో రానాను ఇవాళ సాయంత్రం వరకు విచారించనున్నారు. కాగా నవదీప్ తో ఉన్న సంబందాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా విచారణ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ, రకుల్ ప్రీతి సింగ్ వంటి టాలీవుడ్ ప్రముఖులు ఈడీ విచారణకు హాజరైయ్యారు. తాజాగా డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వచ్చింది.. డ్రగ్స్ కేసుకు మూలంగా ఎఫ్ కేఫ్ లాంజ్ మారినట్లు తెలుస్తోంది. ఎఫ్ కేఫ్ లాంజ్ కేంద్రంగా సినీస్టార్స్ కు డ్రగ్స్ సరఫరా అయినట్టు భావిస్తున్నారు ఈడీ అధికారులు. ఎఫ్ కేఫ్ లాంజ్ ను సెంటర్‌గా చేసుకున్న కెల్విన్.. సినీ తారలకు అక్కడే డ్రగ్స్‌ సప్లై చేసినట్టుగా తెలుస్తోంది.

దీంతో ఎఫ్‌ కేఫ్ లాంజ్‌లో డ్రగ్స్ పార్టీలపై 2017లో దృష్టి సారించింది ఎక్సైజ్ శాఖ.. ఎఫ్ కేఫ్ లాంజ్ పార్టీల ఆధారంగా 2017లో తెర మీదకు టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వచ్చింది.. అదే ఎఫ్ కేఫ్ లాంజ్ వేదికగా జరిగిన డ్రగ్స్ పార్టీ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.. డ్రగ్స్ పార్టీలో మత్తు కోసం జరిగిన లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది.. ఇప్పటికే ఎఫ్ కేఫ్ లాంజ్ మేనేజర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.. సెప్టెంబర్ 13న ఈడీ ఎదుట హాజరు కావాలంటూ ఎఫ్ కేఫ్ లాంజ్ జనరల్ మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేసింది.. అయితే, 2017లో డ్రగ్స్ కేస్ తెర మీదకు వచ్చిన తర్వాత ఎఫ్ కేఫ్ లాంజ్‌ను మూసివేసింది యాజమాన్యం.. అది సినీ నటుడు నవదీప్‌కు సంబంధించిందిగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇదే ఎఫ్ కేఫ్ లాంజ్ నుండి కెల్విన్‌ అండ్ కో డ్రగ్స్ డీలింగ్స్ చేసినట్టుగా గుర్తించారు.. ఇదే ఎఫ్ కేఫ్ లాంజ్ వేదికగా రకుల్, రానా, రవితేజ తదితరలు పార్టీలకు కూడా హాజరైనట్టు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: RC15: ఫస్ట్ పోస్టర్ విడుదల!

Advertisement

తాజా వార్తలు

Advertisement