Friday, April 19, 2024

ఏకాగ్రతతో అమ్మవారి నామస్మరణ చేస్తే దోషాలు తొలగుతాయి : వేలూరు పీఠాధిపతి నారాయణి

తిరుపతి : భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో అమ్మవారిని ప్రతిరోజు నామస్మరణ చేస్తే దోషాలు తొలగిపోతాయి వేలూరు పీఠాధిపతి శ్రీ నారాయణి అమ్మ వారు అన్నారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు స్వర్ణ దేవాలయం ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఏలూరు పీఠాధిపతి నారాయణి అమ్మ వారికి ఏర్పేడు మండలం ఉకృత మాల లోని సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం ధర్మకర్త డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తో పాటు కుటుంబ సభ్యులు స్వామివారికి మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. పీఠాధిపతి నారాయణి అమ్మ వారు సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేలూరు స్వర్ణ దేవాలయం ట్రస్టు, వేలూరు పీఠాధిపతి నారాయణి అమ్మవారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో అమ్మవారిని ప్రతిరోజు నామస్మరణ చేస్తే దోషాలు తొలగిపోతాయి అన్నారు. ప్రతి రోజు ప్రతి ఒక్కరూ దేవుడిని పూజించాలని, అప్పుడే ఆ కుటుంబానికి వారికి శుభాలు కలుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా వికృతం మాల గ్రామ పరిసర ప్రాంతాల్లోని భక్తులు ప్రజలు వేలూరు పీఠాధిపతి నారాయణి అమ్మవారి ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తో పాటు వారి కుటుంబ సభ్యులు పసుపులేటి శివప్రసాద్ పసుపులేటి వెంకటేశ్వర ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు గ్రామ మాజీ సర్పంచ్ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement