Wednesday, April 24, 2024

నిర్మాత‌ల డ‌బ్బుని వేస్ట్ చేయొద్దు.. మెగాస్టార్ చిరంజీవి

మ‌నం మాట్లాడ‌టం ఆపేసి..ప్రేక్ష‌కులు చెప్పిందే విందామ‌ని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.వాల్తేరు వీరయ్య’ ఘన విజయం సాధించడంపై చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయంపై స్పందించడానికి తనకు మాటలు కూడా రాలేదని చెప్పారు. ప్రేక్షకుల ఉత్సహమే మనల్ని నడిపించే ఇంధనమని చెప్పారు. ఈ సినిమా కోసం తాను బాధ్యతతో పని చేశానని అన్నారు.
కష్టం తనది, రవితేజది కాదని… సినిమా బాగా రావాలని పని చేసిన వారిదని చెప్పారు. ఈ విజయం సినీ కార్మికులదని అన్నారు. ఈ సినిమా విజయం ఔత్సాహిక దర్శకులకు ఒక కేస్ స్టడీలా ఉపయోగపడుతుందని చెప్పారు. నిర్మాతల డబ్బును వేస్ట్ చేయవద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement