Tuesday, April 23, 2024

విమానంలో కుక్క కోసం బిజినెస్ క్లాస్ మొత్తం బుకింగ్

ధనవంతుల ఇళ్ల‌ల్లో పెంపుడు జంతువులు రాజభోగాలు అనుభవిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఓ రిచ్‌మెన్ మాత్రం త‌న ప్రేమ అంత‌కుమించి అని నిరూపించుకున్నాడు. త‌న పెంపుడు కుక్క కోసం ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ మొత్తాన్ని బుక్ చేశాడు. బిజినెస్ క్లాస్‌లో తాను, త‌న కుక్క మాత్ర‌మే క‌లిసి ద‌ర్జాగా ప్ర‌యాణించారు. అతడు సీట్లు బుక్ చేసిన‌ ఎయిర్‌ ఇండియా ఏ 320 ఫ్లైట్‌లోని జే క్లాస్ క్యాబిన్‌లో 12 సీట్లు ఉంటాయి. ఇందులో ముంబై -చెన్నై బిజినెస్‌ క్లాస్ సీట్ బుక్ చేసుకోవాలంటే.. రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. అలా మొత్తంగా త‌న పెంపుడు కుక్క కోసం రూ. 2.5 లక్షలకుపైగా యజమాని ఖర్చు చేశాడు.

సాధార‌ణంగా దేశంలో విమానాల్లో ప్ర‌యాణించేందుకు జంతువుల‌ని అనుమ‌తించరు కానీ, ఎయిర్‌ ఇండియా మాత్రం అందుకు మిన‌హాయింపు ఇస్తోంది. ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో గ‌తంలో చాలా మంది పెంపుడు కుక్క‌ల‌ని త‌మ వెంట తీసుకెళ్లారు. కానీ ప్ర‌త్యేకంగా బిజినెస్‌ క్లాస్‌ మొత్తాన్ని కుక్క కోస‌మే బుక్‌ చేయడం మాత్రం ఇదే మొద‌టిసారి అని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సాధార‌ణంగా ఒక విమానంలో ఒకేసారి రెండు జంతువుల‌ను మాత్ర‌మే ప్ర‌యాణానికి అనుమ‌తి ఇస్తారు. అందులోనూ వాటిని చివ‌రి సీటులోనే వాటిని కూర్చోబెట్టాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement