Wednesday, April 24, 2024

వ‌రంగ‌ల్‌లో కుక్క‌ల వీరంగం.. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిపై మూకుమ్మ‌డి దాడి

ధర్మసాగర్, (ప్రభన్యూస్) : మొన్న హైదరాబాద్, నిన్న ఖమ్మంలో చిన్నారులపై వీధి కుక్కల దాడి మరవకముందే ఇవ్వాల వ‌రంగ‌ల్ జిల్లాలో మ‌రో ఘ‌ట‌న జ‌రిగింది. ధర్మసాగర్ మండలంలో ఓ బాలుడిపై వీధికుక్క‌లు రెచ్చిపోయాయి. ముప్పారం గ్రామంలో బాలుడిపై ప్రతాపం చూపించాయి. ముప్పారం గ్రామానికి చెందిన యతీరాజుల రిత్విక్ స్కూల్‌కి వెళ్లి వచ్చి ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయాల‌య్యాయి. బాలుడి తల్లి గమనించి హాస్పిటల్ కు తరలించింది. ప్ర‌స్తుతం బాలుడి ప‌రిస్థితి ప‌ర్వాలేద‌ని, చికిత్స అందిస్తున్న‌ట్టు డాక్ట‌ర్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement