Thursday, March 28, 2024

మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​​ ఇంటిని సొంతం చేసుకున్న డాక్టర్​ దంపతులు..

భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇంటిని ఓ డాక్టర్​ దంపతులు సొంతం చేసుకున్నారు. కోవింద్​ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ఉండడంతో బిహార్‌లోని తన నివాసాన్ని డాక్టర్ దంపతులకు విక్రయించారు. డాక్టర్ బాలా, డాక్టర్ శరద్ కతియార్ ఇప్పుడు బీహార్‌లోని కళ్యాణ్‌పూర్‌ M బ్లాక్‌లోని మాజీ రాష్ట్రపతి నివాసానికి సొంత హక్కుదారులయ్యారు. శరద్, బాలా బిల్హౌర్‌లో శ్రీష్ నర్సింగ్ హోమ్ నడుపుతున్నారు. వారు ప్రస్తుతం కన్హ శ్యామ్‌లో నివసిస్తున్నారు.  

ఇక.. రామ్​నాథ్​ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన కానీ, ఆయన సతీమణి సవిత కానీ అప్పుడప్పుడూ ఈ బంగ్లాను సందర్శించేవారు. ప్రోటోకాల్ ప్రకారం ఆ ఇంటికి ఒక పోలీసు కంపెనీ కాపలాగా ఉంది. దాని కారణంగా ఆ ప్రాంతం VIP హోదాను పొందింది. కాగా, కోవింద్ బంగ్లా ఇక్కడ దయానంద్ బీహార్ మునిసిపల్ బాడీగా ఉన్నందున ఈ ప్రాంతం కొంత ప్రజాదరణ పొందింది. బల్బీర్ సింగ్ నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అందంగా.. మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దడానికి విద్యుత్, అటవీ శాఖ అన్ని ప్రయత్నాలు చేసింది.

మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ ఇంట్లో బస చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు డాక్టర్ శరద్ కతియార్ చెప్పారు. తాను ఢిల్లీలో రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశానని, ఆయన సరళత, సౌమ్యత తనను విస్మయానికి గురిచేశాయని కతియార్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement