Tuesday, March 26, 2024

ఎవ‌రికి ప‌డితే వారికి ఆధార్ జిరాక్స్ కాపీలు ఇవ్వొద్దు – కేంద్రం హెచ్చ‌రిక‌

ఆధార్ జిరాక్స్ కాపీల‌ను ఎవ‌రికి ప‌డితే వారికి ఇవ్వొద్ద‌ని కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఏ వ్యక్తులకుగానీ, సంస్థలకుగానీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వకూడదని, ఇస్తే దానిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సూచించింది. ఈ నెల 27న దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆధార్ ను జారీ చేసే యూఐడీఏఐ లైసెన్స్ ఉన్న సంస్థలు మాత్రమే వివిధ వ్యక్తుల సమాచారం పొందేందుకు వాడుకోవచ్చని స్పష్టం చేసింది. లైసెన్స్ లేని హోటళ్లు, సినిమా హాళ్లు, ఇతర ప్రైవేటు సంస్థలు వ్యక్తుల ఆధార్ కార్డుల జిరాక్స్ ను తీసుకునేందుకు వీలు లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ కాదని తీసుకుంటే ఆధార్ చట్టం 2016 ప్రకారం అది నేరమని తెలిపింది. ఏ సంస్థ అయినా ఆధార్ కోసం డిమాండ్ చేస్తే సదరు సంస్థకు యూఐడీఏఐ నుంచి లైసెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించింది. అంతగా కావాలని పట్టుబడితే యూఐడీఏఐ వెబ్ సైట్ నుంచి చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే ‘మాస్క్ డ్ ఆధార్ కార్డ్’ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇంటర్నెట్ కేఫెలు, కియోస్క్ లలో ఈ–ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోకూడదని, ఒకవేళ చేసుకున్నా వెంటనే ఆ సిస్టమ్ ను వాటిని పర్మనెంట్ గా (షిఫ్ట్ డిలీట్) చేసేయాలని సలహా ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement