Friday, March 29, 2024

Breaking:  ముందే వచ్చిన దీపావళి.. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్​లో ఇండియాదే గెలుపు​​

ఐసీసీ టీ20 వరల్డ్ కప్​ 2022లో ఇవ్వాల (ఆదివారం) పాకిస్తాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో టీమిండియా విజయం సాధించింది. తొలుత తడబాడుటుకు గురైనా ఆ తర్వాత విరాట్​ కోహ్లీ, హార్దిక్​ పాండ్యా నిలదొక్కుకుని ఆడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. 160 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగిన ఇండియా బ్యాటర్లు ఆదిలోనే వరుసగా వికెట్లు పోగొగట్టుకున్నారు. ​ఫస్ట్​ ఆఫ్రిది బౌలింగ్​లో కేఎల్​ రాహుల్ (4)​, ఆ తర్వాత వరుసగా రోహిత్​ శర్మ (4), సూర్యకుమార్​ (15), అక్షర్​ పటేల్​ (2) పరుగులకే పెవేలియన్​ చేరారు.

వన్​ డౌన్​లో వచ్చిన విరాట్​ కోహ్లీ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని కదిలించాడు. హార్దిక్​ పాండ్యా, కోహ్లీ సింగిల్స్​, డబుల్స్​ తీసుకుంటూనే ఫోర్లు, సిక్సులు బాదారు. ఉత్కంఠభరిత మ్యాచ్​లో చివరి ఓవర్​లో హార్దిక్​ అవుటయ్యాడు. దీంతో దినేశ్​ కార్తీక్​, కోహ్లీ టీ ​మిండియాకు విజయం సాధించిపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement