Wednesday, April 24, 2024

ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ కండిషన్​.. కొన్నా, కాల్చినా రూ.200 జరిమానా, ఆరు నెలల జైలు

ఢిల్లీలో కాలుష్యం ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. దాంతో దీపావళి పర్వదినాన… బాణసంచా సంబరాలు లేకుండానే ఢిల్లీ వాసులు పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే… బాణసంచాను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నిషేధ ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ పరిధిలో బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా కూడా రూ.200 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 6 నెలల పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశాలున్నాయని ఢిల్లీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement