Thursday, March 28, 2024

Breaking | క‌రీంన‌గ‌ర్ స్మార్ట్ సిటీ పనుల్లో అపశృతి.. ప్రహరీగోడ కూలి ఒకరి మృతి

కరీంనగర్ : క‌రీంన‌గ‌ర్‌లోని తిరుమల్ నగర్ లో జ‌రుగుతున్న‌ స్మార్ట్ సిటీ పనుల్లో ఒక‌రు చ‌నిపోయారు. ప‌నుల్లో భాగంగా డ్రైనేజీ నిర్మిస్తున్న క్రమంలో ప్రహరీ గోడకూలి బీహార్ కి చెందిన గంగారం అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి.చెందాడు. శిథిలాల కింద‌ ఇరుక్కోవ‌డంతో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన పక్క భవనంలో ఉన్న సీసీ కెమెరాలో దీనికి సంబంధించిన ఫుటేజీ రికార్డ‌య్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement