Tuesday, April 23, 2024

ద‌ర్శ‌కుడు బాబీకి పితృవియోగం-రేపు అంత్య క్రియలు

ద‌ర్శ‌కుడు బాబీ తండ్రి మోహ‌న‌రావు క‌న్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో కాలేయ సంబంధిత వ్యాధి నివారణకు మోహన రావు చికిత్స పొందుతున్నారు. పరిస్థి విషయమించటంతో తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, బాబీ సన్నిహితులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్ర వరకు బాడీని బాబీ సొంత గ్రామం.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నాగారం పాలెంకు చేర్చనున్నారు. రేపు అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

బాబీ 1983 ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో కేఎస్ మోహన రావుకు జన్మించారు. అక్కడే బాబీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత సినీ ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అనూషను పెళ్లి చేసుకున్నాడు.మెగా స్టార్ చిరంజీవి అభిమాని అయిన బాబీ ప్రస్తుతం చిరంజీవినే డైరెక్టర్ చేస్తున్నారు. చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ . ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమవగా.. గతంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తర్వలోనే టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రాన్ని బాబీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తండ్రి మరణవార్త కాస్తా కలిచివేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement