Thursday, April 25, 2024

సూటిపోటి మాటలు.. ఆడ బిడ్డ‌కు వేధింపులు..

ముంబై: అత్త… కోడ‌లు… మ‌న‌వ‌రాలు అంద‌రూ ఆడోళ్లు… అయినా వేధింపులే… ఆడ‌బిడ్డ మ‌న‌సు మ‌రో ఆడ‌బిడ్డ‌కు తెలుసు. ఇక్క‌డ మాత్రం అందుకు విరుద్ధంగా కోడ‌లు ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింద‌ని అత్త వేధించింది. మ‌న‌వ‌రాలు పుట్టి మూణ్ణెళ్లు అయింది. వేధింపులు, సూటిపోటి మాట‌లు శృతిమించాయి.

ఇక ఆ వేధింపులు భ‌రించ‌లేను అని నిశ్చితాభిప్రాయానికొచ్చి… ఆ కోడ‌లు త‌న మూడు నెల‌ల చిన్నారిని నీళ్ల ట్యాంకులో ముంచి హ‌త్య చేసింది. త‌నూ ఓ ఆడ‌దే క‌దా… అని అత్త ఆలోచించ‌లేదు…కోడ‌లూ ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోలేదు. వెర‌సి అభం శుభం తెలియ‌ని ఓ చిన్నారి ప్రాణాలు తీశారు. ఈ ఘ‌ట‌న దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement