Thursday, March 28, 2024

ఇంటి పెరట్లో రూ.745 కోట్లు విలువగల నీలమణుల రాయి..

శ్రీలంకలో ఓ రత్నాల వ్యాపారి పంట పండింది. ఆయన తన ఇంటి పెరట్లో బావి కోసం తవ్వుతుండగా కోట్ల విలువైన నీలమణులు దొరికాయి. తన ఇంటి పెరట్లో బావి తవ్విస్తున్నాడు ఆ వ్యాపారి…అయితే కొంత లోతు తీశాక ఓ పెద్ద బండరాయి అడ్డుగా తగిలింది. ఆ బండరాయి చుట్టూ కొంత దూరం తవ్వుకుంటూ పోయాడు. అందరూ అనుకున్నట్టు అది బండరాయి కాదు. ప్రపంచ మార్కెట్ లో అత్యంత విలువైన నీలమణులు రత్నాల రాయి. అంటే ఒక పెద్ద రాయిలో అనేక చిన్న చిన్న ఇంద్రనీలపు రాళ్లు ఉంటాయి. దీన్ని నీలమణుల క్లస్టర్ అని పిలుస్తారు. ఈ నీలపు రాయి బరువు 510 కేజీలు (2.5 మిలియన్ కేరట్లు). ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన నీలమణుల్లో ఇదే అత్యంత పెద్దది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.745 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా వేశారు.

అక్షరాలా రూ.745 కోట్లు

ఇక రాయి బయటపడిన వెంటనే వ్యాపారి.. అధికారులకు తెలియచేశాడు. అక్కడికి చేరుకున్న అధికారులు సైతం అంత పెద్ద రాయిని చూసి బిత్తరపోయారు. ఇది సుమారు 40 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుంది” అని ప్రఖ్యాత జెమ్మాలజిస్ట్ డాక్టర్ గామిని జోయిసా అంచనా వేశారు.అయితే.., శ్రీలంక రూల్స్ ప్రకారం ఎక్కడ వజ్రాలు దొరికినా అవి ప్రభుత్వ సొంతం. కాకుంటే.., ఎవరికైతే వజ్రం దొరుకుద్ధో వారికి ప్రభుత్వం కొంత వాటాని ఇస్తుంది. ఈ లెక్కన చూసుకున్నా.., ఆ ఇంటి యజమానికి కూడా వందల కోట్ల రూపాయలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: రామ్ చరణ్ న్యూ లుక్… శంకర్ ప్లానింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement