Thursday, April 25, 2024

ధూళిపాళ్లకు నెగిటివ్… రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ పోలీసులు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ధూళిపాళ్లను ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జైల్లో ఆయనకు కరోనా సోకడంతో విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. కరోనా నుంచి కోలుకున్న ఆయనకు తాజా పరీక్షలో నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు. వైద్యుల సూచన మేరకు వారం పాటు ఆయనను ఐసొలేషన్‌లో ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. మరోవైపు ధూళిపాళ్లకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. నరేంద్ర కస్టడీని రీకాల్ చేయాలని పిటిషన్‌లో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement