Saturday, April 20, 2024

ధూళిపాళ్ల నరేంద్రకు తీవ్ర అస్వస్థత

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి నుంచి నరేంద్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. కాగా ధూళిపాళ్ల నరేంద్రను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని.. ధూళిపాళ్ల తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్‌లో ఉన్న సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణకు కరోనా పాజిటివ్ నమోదైంది. దీంతో ఆయనకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కూడా కరోనా లక్షణాల ఉండటంతో మంగళవారం నాడు వైద్యులు పరీక్షలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement