Thursday, April 25, 2024

బీజేపీని బ‌ద‌నాం చేయ‌డం కోసమే ధ‌ర్నాలు : సోయం బాపురావ్

టీఆర్ఎస్ నేత‌లు చేప‌ట్టిన రైతు మ‌హాధ‌ర్నాల‌పై బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ మండిప‌డ్డారు. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. బీజేపీని బదనాం చేయడం కోసం తప్ప రైతులకు మేలు చేసే ఆలోచన టీఆర్ఎస్ కు లేద‌న్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే రుణ మాఫీ చేయండని ఆయ‌న అన్నారు. ఇదంతా హుజురాబాద్ లో ఓటమిపాలు కావ‌డం తట్టుకోలేక వరి ధాన్యం పై రాద్దాంతం చేస్తున్నారన్నారు. కేంద్రం వరి ధాన్యం కొనము అని ఎక్కడా చెప్పలేదన్నారు. టీఆర్‌ఎస్ నేతలు బజార్ రౌడీల్లా మాట్లాడుతున్నార‌ని, త‌మ‌ పరిధి దాటి మాట్లాడుతున్నారని అన్నారు. మెడికల్ కాలేజీ ల కోసం మూడు సార్లు లేఖలు రాశాం. లేఖలు చదువరు.. కానీ బీజేపీ మీద బురద జల్లుతున్నారని ఎంపీ బాపురావు విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement