Saturday, April 20, 2024

317 జీవో రద్దు చేయాలని ధర్నా : కాంగ్రెస్ నేతల అరెస్టు

ఈరోజు 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయుల చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తుంటే పోలీసులు అరెస్టు నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహా రెడ్డి, చేవెళ్ల వసంతం, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, మీర్పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ చల్ల బాల్ రెడ్డి, సత్యానందం, రాములు, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సెక్రెటరీ గెల్లా సుభాష్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు అయితరాజు భాస్కర్, రాజు, త‌దిత‌రులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement