Wednesday, March 27, 2024

దేవినేనికి పితృ వియోగం .. నివాళుల‌ర్పించిన చంద్ర‌బాబు ..

టిడిపి నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకి పితృ వియోగం క‌లిగింది. దేవినేని తండ్రి దేవినేని శ్రీమ‌న్నారాయ‌ణ క‌న్నుమూశారు. విజ‌య‌వాడ‌లోని ప్రేవేటు ఆసుప‌త్రిలో హార్ట్ ఎటాక్ తో మ‌ర‌ణించారు. దేవినేని ఉమ నివాసం వద్దకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. శ్రీమన్నారాయణకు నివాళి అర్పించారు. దేవినేని ఉమను, కుటుంబసభ్యులను ఓదార్చారు. శ్రీమన్నారాయణ వయసు 88 సంవత్సరాలు. ఆయన స్వగ్రామం కంకిపాడు మండలం నెప్పల్లి అయినప్పటికీ… కంచికచర్లలో స్థిరపడ్డారు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. క్రియాశీలక రాజకీయాల్లో ఆయన లేనప్పటికీ… తన కుమారులు దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎన్నోసార్లు పాల్గొన్నారు. ఆయన అంత్యక్రియలను కంచికచర్లలో నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement