Thursday, April 25, 2024

50రోజుల థియేట్రిక‌ల్ ర‌న్ పూర్తి చేసుకున్న వార‌సుడు..

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ డైరెక్ట్ గా న‌టించిన చిత్రం వార‌సుడు. వరిసు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం 50రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చిత్రయూనిట్ కూడా ఈ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారసుడు’ థియేట్రికల్ గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాక్సీఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబ్టంది. త‌మిళ స్టార్ హీరో విజయ్ కేరీర్ లోనే ఈ చిత్రం అత్యధిక గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలించింది. తెలుగులోనూ ఆయనకు అభిమానులు ఉండటంతో ఈ రికార్డును బిగ్ ట్రీట్ గా భావిస్తున్నారు. తమిళ హీరో అయినా.. తెలుగు సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకోవడం సంతోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement